నీట మునిగి 8 మంది మృతి
రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే. మునిగిపోయేవారిని కాపాడేందుకు స్థానికులు యత్నించారు. కానీ అప్పటికే 8 మంది నీటిలో ఊపిరాడక మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.