కోట్లకు పడగలెత్తి...చివరకు....

Crime Published On : Tuesday, December 4, 2018 12:07 PM

ఏసీబీ దాడుల్లో విశాఖ అసిస్టెంట్ ఎంవీఐ రవికుమార్ అక్రమాస్తులు కూడబెట్టి కోట్లకు పడగలెత్తినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం రవికుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి కోట్లలో అక్రమాస్తులను గుర్తించారు. హైదరాబాద్, విశాఖ, విజయనగరంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో 7 ఎకరాల భూమి, శ్రీహరిపురం, ఆరిలోవలో ఖరీదైన ఇళ్లను ఏసీబీ గుర్తించింది. అలాగే బీచ్ రోడ్డులో రెండు నిర్మాణంలో ఉన్న భవనాలు, కాపులుప్పాడలో మూడు స్థలాలు, వేపాడలో ఎకరా భూమిని గుర్తించారు. రవికుమార్‌ ఆస్తుల విలువ రూ.20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.