బాలికపై రెండు రోజుల పాటు మఠాధిపతి అత్యాచారం.. అరెస్ట్
కర్ణాటకలోని రామలింగేశ్వర మఠాధిపతి లోకేశ్వర స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన బెళగావిలోని 17 ఏళ్ల బాలికను రాయచూర్ లోని ఓ లాడ్జిలో ఆ బాలికపై రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను మహాలింగపుర బస్టాండ్ లో వదిలేసి.. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు చేశాడు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి అతని అరెస్టు చేశారు.