105 కిలోల గంజాయి పట్టివేత
కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద ఓ స్కోడా కారును తనిఖీ చేసిన అధికారులకు క్వింటా గంజాయి పట్టుబడింది. విశాఖ జిల్లా పాడేరు నుండి మధురై తరలిస్తుండగా పొట్టిపాడు వద్ద పోలీసులకు కారులో 105 కిలోల గంజాయిను పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.