మైక్రో సాఫ్ట్ ను దాటేసిన మరో ప్రముఖ సంస్థ
అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ ఎన్విడియా కార్పొరేషన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. తాజాగా మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థలను దాటేసి మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ చేసే ఈ కంపెనీ షేర్లు తారస్థాయికి చేరుకోవడంతో షేర్ల విలువ 3.4 శాతం పెరిగాయి. 2024 నుండి ఇప్పటివరకు ఎన్విడియా షేర్లు 160 శాతం పెరిగాయి. మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లు పెరిగాయి.