అధికారం జగన్ ది, పెత్తనం చంద్రబాబుదేనా, వైసీపీ ప్రభుత్వానికి వరుస షాక్ లు: జాతీయ స్థాయిలోనూ.!

Monday, March 16, 2020 12:45 PM Politics
అధికారం జగన్ ది, పెత్తనం చంద్రబాబుదేనా, వైసీపీ ప్రభుత్వానికి వరుస షాక్ లు: జాతీయ స్థాయిలోనూ.!

ఏపీలో అధికారం దక్కిందనే సంతోషం వైసీపీకి లేకుండా పోతోంది. 151 సీట్లు గెలిచినా.పాలనలో తమ మాట నెగ్గించుకోవటం కష్టంగా మారుతోంది. ముఖ్యమంత్రి నేనా.ఎన్నికల కమిషనరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీని భారీ దెబ్బ తీసి.అధికారంలోకి వచ్చినా,చంద్రబాబును పదవీచ్యుతిడిని చేసినా.ఇంకా టీడీపీ అధినేతే అధికారంలో ఉన్నారా అనే విధంగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. మూడు రాజధానుల విషయంలో మండలిలో ఛైర్మన్ నిర్ణయం.ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా .ఇలా వరుసగా తగులుతున్న షాక్ లు వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు సవాల్ గా మారుతున్నాయి.ఒక రకంగా వైసీపీ నేతలు పైకి ధీమాగా మాట్లాడుతున్నా.చంద్రబాబు పైన ఎదురుదాడికి దిగుతున్నా లోలోపల మాత్రం అవమానంగానే భావిస్తున్నారు. దీంతో.ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ విచిత్రంగా ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడల పైన పోరాటం చేయాల్సి వస్తోంది. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమవుతోంది.

For All Tech Queries Please Click Here..!