బిగ్ బ్రేకింగ్: మంత్రివర్గంపై ఊహించని ట్విస్ట్ సీఎం జగన్
Friday, June 7, 2019 03:04 PM Politics
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఏపీకి ఒకరు ఇద్దరు కాకుండా ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒకేసారి ఐదుగురు డిప్యూటీ సీఎంలను వివిధ కులాల ప్రాతిపదికన నియమమిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఈ ఐదుగురిలో వైసీపీ సీనియర్ నేత, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారు కాగా.. మిగిలిన నలుగురు ఎవరనేది తెలియాల్సి ఉంది.
For All Tech Queries Please Click Here..!