జగన్ అధికారంపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

Thursday, May 2, 2019 12:51 PM Politics
జగన్ అధికారంపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం తెలుగుదేశం మరియు వైసీపీ ల మధ్య ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు. ఎన్నికల ఫలితాలు తేలక ముందే రెండు పార్టీల వారు ఒకరి మీద ఒకరు తారా స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇక అలాగే వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరియు ఇతర టీడీపీ నేతల మధ్య అయితే పెద్ద మాటల యుద్ధమే నడుస్తుంది. నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ మరియు ఆ నేతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. దీనితో వారు కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ గట్టిగా ఇచ్చారు.

సేవా మిత్ర యాప్ విషయంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. విజయసాయి రెడ్డి మాటలు కానీ మహిళలు వింటే వారు భయభ్రాంతులకు గురవుతారని ఇలా అబద్దపు మాటలు చెప్పి జనాన్ని వీరు రెచ్చగొడుతున్నారు అని వ్యాఖ్యానించారు.అంతేకాకుండా అబద్దాల కోరు అయినటువంటి విజయసాయి రెడ్డి మాటలు ఖండించుకుంటే అవి జనం నిజమనుకునే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక అలాగే వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చినట్టయితే వ్యాపారస్తులకు కంటి మీద కునుకు ఉండదని, వైసీపీ వారు వారి భూములను ఎక్కడ ఖబ్జాలు చేసేస్తారా అని భయంతో బతుకుతారని తెలిపారు.జగన్ కానీ గెలిస్తే అతన్ని నమ్ముకున్న రౌడీలు,గూండాలు మాత్రమే బాగుపడతారని అందువల్ల జగన్ కానీ అధికారంలోకి వస్తే వారికి పండగే అని ఘాటు విమర్శలు చేసారు.

For All Tech Queries Please Click Here..!