చంద్రబాబుకే నా మద్దతు పవన్ సంచలన వ్యాఖ్యలు !!
పవన్ కళ్యాణ్ దాదాపు నెల రోజుల తర్వాత మీడియాకు మొహం చూపెట్టారు. పోలింగ్ తేదీ దాకా ఊర్లు తిరిగి హల్చల్ చేసినప్పటికీ.. ఆ మరుసటి రోజు నుంచి మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ పవన్ ఉనికి లేదు. పార్టీ కార్యకలాపాలపై ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే దృష్టి పెట్టారు. ఇప్పుడు నంద్యాలకు టూరేసిన పవన్ ఇటీవల మృతి చెందిన సామాజికవేత్త, సీనియర్ పొలిటీషియన్ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ పర్యటనతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురయ్యారు. ఆయనకు ముందునుంచి ఇబ్బంది పెడ్తున్న కంటి గాయం ఇంకా మానలేదు అని సమాచారం అందుకే ఎక్స్పోజర్కి ఛాన్స్ ఇవ్వలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో లెక్కించాల్సిన వీవీ ఫ్యాట్ స్లిప్స్ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు వాయిస్ కి మద్దతు పలికారు. తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఎంత మెజారిటీ వస్తుందనేది ఇప్పుడే చెప్పలేనని, అందరిలా ఊహాగానాలు చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు పవన్.