పవన్ కళ్యాణ్ ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు అంటున్న నాగబాబు
జనసేన అధినేత, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ 2024లో అధికారంలోకి వస్తాడు అంటున్నారు నాగబాబు. నాగబాబు నా ఛానల్ నా ఇష్టం అనే య్యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు, ఆ ఛానల్లో పవన్ కళ్యాణ్ ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు అనే క్యాపన్షన్తో ఓ వీడియో విడుదల చేశారు నాగబాబు. ఏపీలో చాలా మంది ప్రజల నుంచి ఒక్కటే మాట వినిపించింది. చంద్రబాబు మీద, టీడీపీ మీద మాకు విపరీతమైన కోపం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తే ఆయన గవర్నమెంట్ ఫాం చేయలేడేమో? డౌట్ ఉంది. చంద్రబాబును ఓడించాలంటే జగన్ ఒక్కడే దొరికాడు. అని చెప్పారని నాగబాబు తెలిపారు.
2024లో కళ్యాణ్ బాబును మేము తప్పకుండా గెలిపించుకుంటాం అని ప్రజలు అందరు ఫిక్స్ అయ్యారని నానాగబాబు అన్నారు. ఈ సారి మాత్రం జగన్ గారికే ఓటేస్తాం అని చాలా మంది ముందే చెప్పారు. వారు చెప్పినట్లు ఎన్నికల్లో చేశారు. ప్రజలు చాలా పాజిటివ్ గానే మాట్లాడారు. వారిని తప్పుగా భావించాల్సిన పని లేదని నాగబాబు తెలిపారు.రాజకీయాల్లో గెలవటం, ఓడిపోవడం ఒక కాయిన్కు రెండు సైడ్స్ లాంటివి. గెలిచినంత మాత్రాన గొప్పవాడనో, ఓడిపోయినంత మాత్రాన చేతకానివాడు అని అనడం సరైంది కాదు. ఓడిపోవడానికి వంద కారణాలు ఉంటాయని నాగబాబు తెలిపారు. ఒక్కసారి జగన్ గారికి ఛాన్స్ ఇద్దాం, పవన్ కళ్యాణ్కు 2024లో ఇద్దాం అని ప్రజలు ఫీలయ్యారని మెగా బ్రదర్ అభిప్రాయ పడ్డారు.