లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే, మనవడితో రోడ్డుపై ఆటలు, జనాల ఆగ్రహం తో..!

Monday, March 30, 2020 03:47 PM Politics
లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే, మనవడితో రోడ్డుపై ఆటలు, జనాల ఆగ్రహం తో..!

కరోనా వైరస్ ప్రభావానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ కరోనా వ్యాప్తి వల్ల చాలామంది ప్రజలు చనిపోతున్నారు. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కారణంగా చాలా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ లో భాగంగా అత్యవసర సేవలు మినహాయించి మిగిలినవన్నీ రద్దు చేశారు. అన్ని రాష్ట్రాల బోర్డర్స్ మూసివేశారు, ఒక రాష్ట్రంలోని ప్రజలను ఇతర రాష్ట్రాలకు వెళ్లనియ్యడం లేదు.

ఇటువంటి భయానక సమయంలో భాద్యతాయక పదవిలోవున్న కర్ణాటకకు చెందిన ఒక ఎమ్మెల్యే తన మనవడితో రోడ్డుపైకి రావడం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.కర్ణాటకలోని గుబ్బి అనే ప్రాంతానికి చెందిన శాసనసభ సభ్యుడు ఎస్.ఆర్.శ్రీనివాస్ లాక్ డౌన్ సమయంలో రహదారిపైకి తన మనవడితో రోడ్డుపైకి వచ్చాడు. ఈ విధంగా రోడ్డుపైకి వచ్చినప్పుడు ఈ సంఘటనను ఒక పోలీసు అధికారి మొబైల్ ఫోన్ కెమెరాలో వీడియో తీశారు

For All Tech Queries Please Click Here..!
Topics: