చంద్రబాబుకి దిమ్మతిరిగేలా సమాధానమిచ్చిన గ్రామవాలంటీర్..!!

Monday, September 30, 2019 09:46 AM Politics
చంద్రబాబుకి దిమ్మతిరిగేలా సమాధానమిచ్చిన గ్రామవాలంటీర్..!!

ఆగష్టు 15 వ తేదీ గ్రామవాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ లో విధుల్లో చేరారు. వీరంతా గ్రామాల్లో ఉంటూ ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పిన గ్రామవాలంటీర్లు పనిచేస్తున్నారు. అయితే, గ్రామవాలంటీర్ల వలన ఉపయోగం లేదని, గ్రామవాలంటీర్ల పేరుతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని చంద్రబాబు గతంలో మండిపడిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలకు పనులు కల్పించేందుకు జగన్ పార్టీ చేసిన పధకం మాత్రమే ఇది అని పేర్కొన్నారు. దీనిపై వైసీపీ పార్టీ నేతలు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని బాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. గ్రామవాలంటీర్ల వ్యవస్థ వలన ఉపయోగం లేదని అంటున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ధర్మసాగరంకు చెందిన బొయిలమ్మా అనే గ్రామవాలంటీర్ స్పృహతప్పి పడిపోయి ఉన్న ఓ అనాథను 108 వాహనంలో ఎక్కించేందుకు సహాయం చేస్తున్న ఫోటో అది. ఆ ఫోటోను రిలీజ్ చేసి. ఇది గ్రామవాలంటీర్ సత్తా అంటే అని అన్నారు రజిని.

సత్తా ఉన్న వ్యక్తులు గ్రామవాలంటీర్లు అని. కేవలం ప్రజలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇలా సేవా రంగంలో కూడా గ్రామవాలంటీర్లు చురుగ్గా పాల్గొంటున్నారని, ఈ విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని బాబుకు హితవు పలికింది విడదల రజిని. గ్రామవాలంటీర్ వ్యవస్థ బాగాలేదని, కించేపరిచే విధంగా ఉన్నాయని అని అనడం, 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదని గతంలో వైసీపీ నేతలు పేర్కొన్నారు.  గ్రామవాలంటీర్లకు అక్టోబర్ 1 వ తేదీన వారి జీతాలు వారి ఖాతాలో వేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 2 వ తేదీ నుంచి గ్రామసచివాలయ ఉద్యోగులు అందుబాటులోకి వస్తారు. గ్రామాలకు సంబంధించిన అన్ని విషయాలను గ్రామసచివాలయం చూసుకుంటుంది. ఇలా చేయడం వలన గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుందని, తద్వారా యువతకు ఉద్యోగం కల్పించినట్టు అవుతుంది. జగన్ చెప్పినట్టుగా వచ్చిన మూడు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించి శభాష్ అనిపించుకున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: