ఏపీలో ఏం జరుగుతోంది,కేంద్రం ఆరా: ఈ ఘర్షణకు కారణమేంటి: లోక్ సభలో వైసీపీ వాయిదా తీర్మానం,!

Tuesday, March 17, 2020 09:31 AM Politics
ఏపీలో ఏం జరుగుతోంది,కేంద్రం ఆరా: ఈ ఘర్షణకు కారణమేంటి: లోక్ సభలో వైసీపీ వాయిదా తీర్మానం,!

ఏపీలో జరుగుతున్న పరిణామాలపైన కేంద్ర ఆరా తీస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా,రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పైన ముఖ్యమంత్రి నేరుగా గవర్నర్ కు ఫిర్యాదు చేయటం,ఆ తరువాత సీఎం నేరుగా ఎన్నికల కమిషనర్ పైన ఆగ్రహం వ్యక్తం చేయటం,మంత్రుల విమర్శలు,ప్రతిపక్షాల ఆరోపణల పైన పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్ సైతం ప్రాధమికంగా ఏపీలో ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నట్లుగా మారిన వివాదం పైన నివేదిక పంపినట్లుగా సమాచారం. దీంతో,పాటు రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర నిఘా సంస్థల నుండి సమాచారం సేకరిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!