ఇంటింటికీ తిరుగుతూ క్షమించమని కోరుతున్న ఓడిపోయిన టీడీపీ నేత

Sunday, May 26, 2019 07:29 AM Politics
ఇంటింటికీ తిరుగుతూ క్షమించమని కోరుతున్న ఓడిపోయిన టీడీపీ నేత

 టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 23న వెలువడిన ఫలితాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఓడిపోయానని బాధపడకుండా ఆయన ఇంటింటా తిరుగుతూ క్షమాపణ కోరారు. పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై బులెట్‌పై ఒంటరిగా పర్యటిస్తూ తాను ఏమైనా తప్పు చేస్తే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ఓటు వేసినవాళ్లకు, వేయని వారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. తానేమీ తప్పు చేయలేదని.. అయినా తనను క్షమించాలని వేడుకున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో ఎంతో కాలం పనిచేసిన సుధీర్ఘ అనుభవం ఉన్న నాయకులు, టీడీపీ కుటుంబ సభ్యులు మరియు ఎంతో మంది సినీ సెలబ్రిటీల తమ అదృష్టాన్ని పరీక్షించున్నారు. టీడీపీకి జరిగిన గత ఎన్నికలో చరిత్రలో ఎన్నడూలేని విధంగా తెలుగు దేశం పార్టీ దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది. పార్టీ అధ్యక్షుడితో పాటు పెద్ద పెద్ద నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఓడిపోయిన నేతలు బయటకు రాలేకపోతున్నారు. కానీ బోడె ప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ క్షమించమని కోరడం ఆయన హుందాతనాన్ని ప్రదర్శించింది.

ొొ
For All Tech Queries Please Click Here..!