తెలుగు దేశంలో మొదలయిన పెనుతుఫాన్ ....!

Wednesday, June 19, 2019 12:10 PM Politics
తెలుగు దేశంలో మొదలయిన పెనుతుఫాన్ ....!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో సంచలనాలు చూడబోతున్నారు అని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి మీడియా ద్వారా ప్రజలకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొందరు కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. కాంగ్రెస్ మరియు టీడీపీకి చెందిన ముఖ్య నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని సెంట్రల్లో దెబ్బ తీయాలని చూసిన టీడీపీకి అసలు సమస్య మొదలయింది అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. టీడీపీలో త్వరలో భారీ చీలిక రాబోతుందని, చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో ఘోర ఓటమితో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందని, రాబోయే కాలంలో ఊహించని విధంగా ఇంకా పెద్ద దెబ్బ తగులుతుందని జోస్యం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు కొందరు తమ పార్టీతో సంప్రదింపులు జరిపారని ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని, సీమకు చెందిన కొన్ని పెద్ద రాజకీయ కుటుంబాలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారంటున్నారు. రాష్ట్రానికి చెందిన నేతల చేరికపై బీజేపీ అధిష్టానం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. లోకేష్ అవినీతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

For All Tech Queries Please Click Here..!