జగన్ కేబినెట్లో కొత్త మంత్రులు... విజయ్‌సాయి రెడ్డి ఆహ్వానం

Friday, June 7, 2019 03:56 PM Politics
 జగన్ కేబినెట్లో కొత్త మంత్రులు... విజయ్‌సాయి రెడ్డి ఆహ్వానం

ఏపీ కేబినెట్ కూర్పు దాదాపు ఖాయమైంది. మంత్రివర్గంలోకి తీసుకోబోతున్న నేతలకు విజయసాయిరెడ్డి ఫోన్ చేసి తెలిపినట్లు సమాచారం. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే నేతలతో మాట్లాడిన జగన్..ఏ ప్రాతిపదికన మంత్రి పదవి ఇవ్వబోతున్నది వివరించారు. 25 మందితో పూర్తిస్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఈ ఎనిమిది మందికి కేబినెట్ బెర్తులు ఖాయమైనట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్  మంత్రివర్గంలో మంత్రులను ఖరారు చేస్తుున్నారు. ఇప్పుటికే సుమారు ఐదు మంది అభ్యర్థులకు మంత్రి పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉండాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం నాడు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేశారు.

బొత్స సత్యనారాయణ, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, కొడాలి నాని, ధర్మాన క్రిష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్, పార్థసారధి, సుచరితలకు విజయసాయిరెడ్డి ఫోన్లు చేశారు.రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్దంగా ఉండాలని విజయసాయిరెడ్డి సూచించారు.

మంత్రి పదవులు దక్కేవారికి శుక్రవారం సాయంత్రం విజయసాయిరెడ్డి ఫోన్లు చేస్తారని వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ ప్రకటించారు. అయితే మంత్రులుగా ప్రమాణం  చేసే వారు తమ కార్యకర్తలకు సమాచారం ఇచ్చేందుకు వీలుగా శుక్రవారం నాడు మధ్యాహ్నమే విజయసాయిరెడ్డి ఫోన్లు చేశారు. మిగిలినవారికి కూడ విజయసాయి రెడ్డి ఫోన్లు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

For All Tech Queries Please Click Here..!