ఈఎంఐలపై మారటోరియం, స్పందించిన ప్రైవేట్ బ్యాంకులు

Thursday, April 2, 2020 07:27 AM Offbeat
ఈఎంఐలపై మారటోరియం, స్పందించిన ప్రైవేట్ బ్యాంకులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్డౌన్ ఉండటంతో ప్రజల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారు బ్యాంకులకు చెల్లించాల్సిన లోన్ ఈఎంలపై మూడు నెలల పాటు మారటోరియం సదుపాయం కల్పించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఈ సూచనల మేరకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఆ సదుపాయం కల్పిస్తూ ప్రకటనలు చేశాయి. ఇప్పుడు ఈఎంలపై మూడు నెలల పాటు మారటోరియం విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ముందుకొచ్చాయి.

ఈఎంఐలపైమారటోరియం అవసరం లేని వినియోగదారులు తమను సంప్రదించాల్సిన అవసరం లేదంటూ తమ ఖాతాదారులకుహెచ్ డీఎఫ్ సీ, కోటక్ మహీంద్ర బ్యాంకులు విజ్ఞప్తి చేస్తున్నాయి. మారటోరియం కోరుకునే వినియోగదారుల కోసం ఓ ఈ-మెయిల్ ఐడీని కోటక్ మహీంద్ర బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. మారటోరియం కాలానికి వడ్డీని వసూలు చేస్తామని తెలిపింది. మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. వేతనం దారుల రుణాలపై ఆప్ట్-ఇన్ , వ్యాపారుల కోసం ఆప్ట్-ఔట్ ఆప్షన్స్ ను తీసుకొచ్చింది. మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు మాత్రం మారటోరియం విధివిధానాలపై పనిచేస్తున్నట్టు తెలిపింది.

For All Tech Queries Please Click Here..!
Topics: