కన్నుల పండుగగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు

Saturday, October 19, 2019 03:15 PM News
కన్నుల పండుగగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్షం దైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమై మొత్తం తొమ్మిది రోజుల పాటు అక్టోబరు 8 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం ఏడుకొండలను ఇల వైకుంఠాన్ని తలపించేలా టీటీడీ అలంకరించింది.మాడ వీధుల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలతో తిరుమల 9రోజుల పాటు దేదీప్యమానంగా వెలిగిపోనుంది. బ్రహ్మోత్సవాల ముందు రోజు వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవం మొదలు కానుంది. ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించడమే ఈ కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ ఘట్టంలో స్వామివారి సర్వసైన్యాధక్షడైన విష్వక్సేనుడు రాత్రి 7 గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి తినే మాడవీధుల్లోని వసంత మంటపానికి వేంచేస్తాడు. అక్కడ అర్చకస్వాములు పుట్టమన్ను సేకరించి నవపాలికలలో ఉంచుకొని ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి వస్తారు. యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించి పాలికలలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేసే ప్రక్రియను వైదికంగా నిర్వహిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లవుతుంది.

మొక్కలకు అధిదేవుడు చంద్రుడు కాబట్టి.. రాత్రి సమయంలోనే ధాన్యాలను నాటడం చేస్తారు. అవి బాగా మొలకెత్తితే ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. అనంతరం కొన్ని క్రతువులు నిర్వహించిన తర్వాతి రోజు నుంచి ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 8న శ్రీవారికి చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ మలయప్పస్వామి వివిధ రకాల వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామికి వాహనసేవలు జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ఎంతో వైభంగా నిర్వహిస్తారు. 30వ తేదీ ఉదయం ధ్వజారోహణం ఘట్టంలో రాత్రి పెద్ద శేషవాహనంపై శ్రీవారి దర్శనమివ్వనున్నారు. ఇలా ప్రతీ రోజూ ఉదయం ఒక వాహనం రాత్రి మరో వాహనంపై తిరు మాడవీధుల్లో విహరిస్తారు స్వామివారు. ఇక ఈ నెల 13న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

9 రోజుల ఘట్టాలు ఇవే

సెప్టెంబర్ 30న పెద్దశేష వాహనం

అక్టోబరు 1న చిన్నశేష వాహనం. హంస వాహనం,

అక్టోబరు 2న సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం

అక్టోబరు 3న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం

అక్టోబరు 4న మోహిని అవతారం, గరుడ వాహనం, ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత గలిగిన ఘట్టం ఇది. స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడుడిపై ఉన్న స్వామిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం

అక్టోబరు 5న హనుమంత వాహనం, గజవాహనం

అక్టోబరు 6న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

అక్టోబరు 7న స్వర్ణ రథం, అశ్వ వాహనం

అక్టోబరు 8న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

For All Tech Queries Please Click Here..!