కరోనాపై పోరుకు చైనా కంపెనీ టిక్టాక్ భారీ సాయం
కరోనాపై పోరుకు భారత్కు అండగా నిలిచింది చైనాకి చెందిన టిక్టాక్, సహాయం చేయడానికి ఇండియాకి చెందని కంపనీలలో మొదటిగా ముందుకువచ్చిన కంపెనీ ఇదే. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వీడియో యాప్ టిక్టాక్ తనవంతు సాయం అందించింది. సుమారు రూ. 100 కోట్ల విలువైన నాలుగు లక్షల హజ్మత్ సూట్లను కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య బృందాలకు అందించనుంది. ఈ మేరకు తొలి విడతలో 26వేలకు పైగా ఈ రోజు ఉదయం భారత్కు పంపించింది. మరో విడతలో లక్షకు పైగా సూట్లను ఇదే వారంలో పంపించనున్నట్లు ప్రకటించింది. మిగతా సూట్లను రెండు వారాల్లో దశల వారిగా అందిస్తామని టిక్టాక్ అధికారులు పేర్కొన్నారు. వైద్య బృందానికి సూట్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో టిక్టాక్ సూట్లను అందించడం కాస్తా ఉపశమనంగా చెప్పుకోవచ్చు.
కాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 409 కొత్త కేసులు నమోదయ్యాయని , 7 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క తమిళనాడులోనే 110 కొత్త కేసులు నమోదయ్యాయి కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1870 కాగా మరణాల సంఖ్య 56 గా ఉంది.