టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ

Monday, December 3, 2018 09:57 PM News
టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ

నెల్లూరు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుగ్గా ఉంటున్న వేనాటి కుటుంబానికి చెందిన నేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు, సూళ్లూరుపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ వేనాటి సుమంత్‌రెడ్డి సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుమంత్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి చేరారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాని గోవర్దన్‌ రెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు పెర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, టి. సుబ్రహ్మణ్యం రెడ్డి, కే కమలాకర్‌ రెడ్డి, పీ. సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

For All Tech Queries Please Click Here..!