ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగుడు

Monday, November 4, 2019 04:09 PM News
ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగుడు

హైదరాబాద్ శివారుల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. తహశీల్దార్ విజయారెడ్డిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినవానికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. ఈ ఘటనలో విజయారెడ్డి అక్కడికక్కడ మృతిచెందారు. ఆ తర్వాత దుండగుడు కూడా తనపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనలో గాయాలపాలైనవారిని చికిత్స నిమిత్తం ఆస్సత్రికి తరలించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఓ వ్యక్తి ఆఫీసులోపలికి వెళ్లాడు.

అరగంటపాటు చర్చించారు. అనంతరం ఒంటిపై మంటలతో విజయారెడ్డి బయటకు వచ్చారు.దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ... తీవ్రగాయాలపాలై ఆమె తహశీల్దార్ కార్యాలయంలోనే మృతిచెందారు. అయితే ఈ ఘటనకు కారణం ఎమ్మార్వో వేధింపులేనని తెలుస్తోంది. విజయారెడ్డికి మంటలు అంటించిన వ్యక్తి సురేష్ అనే రైతుగా గుర్తించారు.హత్యకు దారితీసిన కారణాలపై అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే పొలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మార్వో డబ్బుల కోసం వేధించినట్లుగా సురేష్ ఆరోపిస్తున్నాడు. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు లంచం అడిగినందుకే ఆమెను సజీవ దహనం చేసినట్లుగా తెలిపాడు. అనంతరం నిందితుడు వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

For All Tech Queries Please Click Here..!
Topics: