రూ. 5 వేలకే 32 అంగుళాల స్మార్ట్ టీవీ
Friday, February 1, 2019 08:06 AM News
వినోదం అందుతోంది. అయితే, ఇప్పటికీ ఎంతో మందికి అందని ద్రాక్షలాగే ఉంది. దీంతో మధ్య తరగతి మరియు దిగువ తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి చెందిన ఓ సంస్థ అత్యంత చౌక స్మార్ట్ టీవీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
అవును, సగటు స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ధరలో కేవలం రూ. 5,000 ధరతో 32 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీని షామీ ఇన్ఫర్మేటిక్స్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. షామీ మొబైల్ యాప్ ద్వారా ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు. టీవీ ధర మరియు ట్యాక్సులతో కలుపుకుంటే దీని మొత్తం ధర రూ. 6,000 నుండి రూ. 7,000 మధ్య ఉండే అవకాశం ఉంది. 32 అంగుళాల స్మార్ట్ టీవీలు 12 వేల కంటే అధిక ధరలో అందుబాటులో ఉన్నాయి.
షామీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు...
- 1366×786 కొలతల్లో గల రెజల్యూషన్ స్క్రీన్
- ఐపీఎస్ హెచ్డీ ప్యానల్
- ఆండ్రాయిడ్ 4.4 కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్
- 10 వాట్స్ కెపాసిటీ గల రెండు స్పీకర్లు
- 2 హెచ్డీఎంఐ పోర్టులు
- 2 యూఎస్బీ పోర్టులు
- అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్
- స్మార్ట్ టీవీ రిమోట్
- వాల్ మౌంట్ యాక్ససిరీస్
- టీవీ మొత్తం బరువు 6 కిలోలు
For All Tech Queries Please Click Here..!