అలిగిన రోజాకు బంపర్ ఆఫర్: ప్రతిష్ఠాత్మక కార్పొరేషన్కు ఛైర్పర్సన్గా..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించిన నాయకుల్లో ఆర్కే రోజా ఒకరు. జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ రోజాకు హోమ్ మంత్రి పదవి లేక స్పీకర్ పదవి అని వార్తలు వచ్చాయి. తీరా మంత్రివర్గం ఏర్పాటయ్యే సరికి రోజాకు చోటే దక్కలేదు. అంచనాలకు అందని విధంగా మంత్రివర్గ కూర్చును ప్రకటించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్ల పార్టీ అనే ముద్రను తొలగించుకోవడానికి జగన్ ప్రయత్నించారాయన. తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు మంత్రివర్గంలో పరిమితంగా చోటు కల్పించారు. దళిత, గిరిజన, బడుగు, బలహీన, సామాజిక వర్గ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి కీలక శాఖలకు అప్పగించారు.
మంత్రివర్గంలో చోటు దక్కనందుకు రోజా అలిగారని, అందుకే ఆమె పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటున్నారని ఒక న్యూస్ వచ్చింది. దీనితో ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా- రోజాకు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్పర్సన్గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్టీసీ ఛైర్పర్సన్ పదవి కోసం రోజా పేరు దాదాపు ఖాయమైందని సమాచారం.