ప్రయాణికులకు శుభవార్త: రైల్వే, విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ ఆరంభం..!

Thursday, April 2, 2020 10:51 AM News
ప్రయాణికులకు శుభవార్త: రైల్వే, విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ ఆరంభం..!

ప్రయాణికులకు రైల్వే, ప్రైవేటు విమానయాన సంస్థలు శుభవార్తను వెల్లడించాయి. రైల్వే, విమాన ప్రయాణాల కోసం ముందస్తు టికెట్ల బుకింగ్‌ను ఆరంభించాయి. గురువారం(02-ఏప్రిల్-2020) ఉదయం టికెట్ల రిజర్వేషన్లను చేపట్టాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రయాణం సాగించడానికి వీలుగా ఆన్‌లైన్ల ద్వారా టికెట్లను జారీ చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తోంటే ఈ నెల 15వ తేదీన దేశవ్యాప్తంగా రైళ్లన్నీ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విమానాల రాకపోకలు ఆరంభమౌతాయనే సంకేతాలను ఇచ్చినట్టయింది. ప్రస్తానికి దేశీయ విమాన ప్రయాణాలకే అనుమతి ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ముగియబోతోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు గానీ, అలాంటి ప్రణాళిక గానీ ప్రస్తుతానికి తమ వద్ద ఏదీ లేదంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ప్రకటించారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారంటూ వస్తోన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అలాంటి వార్లన్నీ నిరాధారమైనవేనని, వాటిని నమ్మొద్దని సూచించారు. లాక్‌డౌన్ పొడిగించట్లేదంటూ ఒకరకంగా రాజీవ్ గౌబా కుండబద్దలు కొట్టినట్టయింది.

For All Tech Queries Please Click Here..!
Topics: