జగన్ చేతిలో రిమోట్, ఎనలేని ప్రేమ చూపించిన కేసీఆర్ ..!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన శిలాఫలకాన్ని స్విచ్ ఆన్ చేసి ఆవిష్కరించారు. సరిగ్గా 11:23 నిమిషాలకు ఈ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇద్దరూ ఉన్నప్పటికీ వైఎస్ జగన్కు ఈ అవకాశం కల్పించడం విశేషం.. శిలాఫలకం ప్రారంభం అనంతరం ప్రాజెక్ట్ దగ్గర మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కొబ్బరికాయలు కొట్టారు. ఆయన తర్వాత అతిథులు కొబ్బరికాయలు కొట్టగా.. చివరన కేసీఆర్ గుమ్మడికాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ను కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఇందుకు సంబధించిన హైలెట్స్ వీడియోలో చూడవచ్చు.