తెలంగాణ పోరు...ఇంటేలిజెన్స్ రిపోర్ట్
తెలంగాణ ఎన్నికల సమరంలో ప్రచార పర్వానికి మరో 48 గంటల్లో తెర పడనుంది. ఏ పార్టీ గెలవబోతోంది? ఏ అభ్యర్థి గెలుస్తాడు? ఎవరి బలాలేంటి? ఎవరి బలహీనతలు ఏంటి? అన్నదానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. టిఆర్ఎస్ సర్వేలన్నీ ఆ పార్టీకి వంద సీట్లు గ్యారెంటీగా వస్తాయని.... కూటమిదే అధికారం అని కాంగ్రెస్, టిడిపి చేసిన సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం వారు చేసిన తాజా సర్వే వివరాలు బయటకొచ్చాయి. తెలంగాణకు చెందిన సెంట్రల్ ఇంటలిజెన్స్ అధికార వర్గాలు చేసిన సర్వే వివరాలను కేంద్రానికి సమర్పించాయి. ఆ సర్వే నివేదికలను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు సేకరించారు.
ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడో వివరించింది ఆ సర్వే. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 58 సీట్లలో, టిఆర్ఎస్ 29 సీట్లలో టిడిపి 9 సీట్లలో, ఎంఐఎం 6 సీట్లలో, బిజెపి 2 సీట్లలో గెలుస్తాయని ఈ నివేదిక వెల్లడించింది. 15 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.