భార్య భర్తను చంపితే... అది మర్డర్ కాదు!

Monday, January 28, 2019 10:41 PM News
భార్య భర్తను చంపితే... అది మర్డర్ కాదు!

భార్య భర్తను చంపితే అది మ‌ర్డ‌ర్ కాదని సుప్రీం కోర్టు సంచలన తీర్పున వెలువరించింది. అవును, ఏ ఇల్లాలు అయినా భర్తను చంపితే అది మర్డర్ కాదు,  కానీ ఆ ఘ‌ట‌న‌ను ఓ న‌ర‌హ‌త్య‌గా భావించాల‌ని తీర్పునిస్తూ సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.


తమిళ‌నాడు కేసులో సుప్రీం ఈ తీర్పును ఇచ్చింది. కూతురు ముందే భార్య‌ను ఆమె భ‌ర్త వ్య‌భిచారిణి అని నిందించిన‌ప్పుడు ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను చంపేస్తే అప్పుడు అది హ‌త్య కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. మ‌న‌ స‌మాజంలో ఏ మ‌హిళ కూడా వ్య‌భిచారిణి అని అనిపించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌దు అని, ఆ మాట విన‌లేక మ‌హిళ త‌న కోపాన్ని భ‌ర్త‌పై చూపించింద‌ని కోర్టు తీర్పునిచ్చింది.


నిజానికి ఆ మ‌హిళ మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. ఆ విష‌యం భ‌ర్త‌కు తెలియడంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ మొదలైంది. ఆ స‌మ‌యంలో ఆ మ‌హిళ ప్రియుడు కూడా ఆ గొడవలో పాల్గొన్నాడు. ఆమె కూత‌రు అక్క‌డే కూడా ఉంది. భ‌ర్త తీవ్ర స్థాయిలో దూషించడంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన భార్య త‌న ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను అతి దారుణంగా హ‌త్య చేసింది. ఫ్రెండ్ సహాయంతో భ‌ర్త‌ను కాల్చేసిన ఆమె త‌న నేరాన్ని కోర్టులో ఒప్పుకుంది. ఈ కేసులో మ‌ద్రాసు కోర్టు ఆ మ‌హిళ‌కు, త‌న ప్రియుడికి జైలు శిక్ష విధించింది. అయితే మద్రాసు హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. ఆ కేసును విచారించిన శంత‌న్‌గౌడ‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం నేడు సుప్రీంలో తీర్పునిచ్చింది. వ్య‌భిచారి అని పిల‌వ‌డం వ‌ల్ల మ‌హిళ ఉన్నట్లుండి ఆవేశానికి లోనైంద‌ని, దాంతో ఆమె భ‌ర్త‌పై దాడి చేసింద‌ని సుప్రీం వెల్ల‌డించింది. అంతే కాకుండా ఆ మ‌హిళ‌పై న‌మోదైన మ‌ర్డ‌ర్ కేసును కొట్టివేస్తూ దాన్ని దోష రహిత నరహత్యగా తీర్పును మార్చింది. జైలు శిక్ష‌ను కూడా ప‌దేళ్ల‌కు త‌గ్గించింది.

For All Tech Queries Please Click Here..!