క్వారంటైన్ కేంద్రం ధ్వసం చేసి ఇద్దరు జమాత్ కార్యకర్తల పరారీ..!

Saturday, April 4, 2020 10:37 AM News
క్వారంటైన్ కేంద్రం ధ్వసం చేసి ఇద్దరు జమాత్ కార్యకర్తల పరారీ..!

కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఢిల్లీ మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వీరు ప్రభుత్వానికి అసలు సహకరించటలేదు.  కరోనా వైరస్ విస్తరించకుండా ఢిల్లీ వెళ్లి వచ్చిన ఇద్దరు జమాత్ కార్యకర్తలను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. క్వారంటైన్‌లో ఉండాల్సిన ఇద్దరు కార్యకర్తలు ఆసుపత్రి కిటికీని పగలగొట్టి పారిపోయారు. పారిపోయిన జమాత్ కార్యకర్తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 14 రోజులపాటటు క్వారంటైన్ లో ఉండాల్సిన వారు పారిపోవడంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు.

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 563 కొత్త కేసులు నమోదయ్యాయని , 14 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క ఢిల్లీ లోనే  93,  ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణాలో 75 కొత్త కేసులు నమోదయ్యాయి,  కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2785 కాగా మరణాల సంఖ్య 86 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: