కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ జయరాం అనుమానాస్పద మృతి
జయరాం అనుమానాస్పద మృతి.. కోస్టల్ బ్యాంకు చైర్మన్, ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర హైవేపై కారులో జయరామ్ మృతదేహం లభ్యమైంది. అమెరికాలోని తెలుగు వారందరికీ సుపరిచితమైన ఎన్నారై చిగురుపాటి జయరాం మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో వెను క సీట్లో కూర్చొని ఉన్న ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. తెల్లవారుజామున కారులోని మృత దేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కారులో ఉన్నది చిగురుపాటి జయ రాం అని గుర్తుపట్టిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి వ్యవహారాల విషయంలో గొడవలు ఏమైనా ఉన్నాయా..అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
జయరాం స్వస్థలం విజయవాడ. ఆయన న్యూయార్క్లో చదువుకున్నారు. అక్కడే స్థిరపడి అంచలంచెలుగా ఎది గారు. వ్యాపార రంగంలో ప్రవేశించిన ఆయన కోస్టల్ బ్యాంకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఎక్స్ప్రెస్ టీవీని కూడా స్థాపిం చారు. ఆ తర్వాత నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు. అయితే కారు లో మృతదేశం గుర్తించిన పోలీసులు.. అయితే కారు డ్రైవర్ ఏమయ్యాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది.