భారీగా పెరిగిన సిమెంట్ ధరలు

Thursday, February 7, 2019 10:30 AM News
భారీగా పెరిగిన సిమెంట్ ధరలు

దేశీయంగా నిర్మాణం రంగం ఊపందుకోవడంతో సిమెంట్ మరియు నిర్మాణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులకు గిరాకీ బాగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో డిమాండును దృష్టిలో ఉంచుకుని పలు దేశీయ సిమెంట్ తయారీ సంస్థలు 50 కిలోల సిమెంట్ బస్తా ధర మీద రూ. 40 నుండి రూ. 60 వరకు పెంచాయి. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న డిమాండును క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు ధరల పెంచినట్లు తెలుస్తోంది. సాగర్ సిమెంట్, ఓరియెంట్ సిమెంట్స్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ ఇండస్ట్రీస్, రామ్‌కో సిమెంట్ మరియు పలు ఇతర సిమెంట్ కంపెనీలు ఈ ధరలో బాటలో ఉన్నాయి.

For All Tech Queries Please Click Here..!