ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 12 కరోనా కేసులు, 161కి చేరిన బాధితుల సంఖ్య

Friday, April 3, 2020 11:15 AM News
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 12 కరోనా కేసులు, 161కి చేరిన బాధితుల సంఖ్య

ఏపీలో కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనేఉంది. గత 12 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 12 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కు చేరుకుంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదు కావడం అక్కడ కలకలం రేపుతోంది. ఏపీలో కరోనా వైరస్ కలకలం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ కొన్ని జిల్లాలకే పరిమితమైన కేసుల ఉద్ధృతి ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాలకూ పాకింది. తాజాగా నిన్న రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ పరీక్షించిన శాంపిళ్లలో 12 కొత్త కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 477 కొత్త కేసులు నమోదయ్యాయని , 17 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క ఢిల్లీ లోనే  141,  ఆంధ్రప్రదేశ్ లో 38, తెలంగాణాలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి,  కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2275 కాగా మరణాల సంఖ్య 72 గా ఉంది

For All Tech Queries Please Click Here..!
Topics: