ఢిల్లీ మతప్రచారానికి వచ్చిన 960 మంది విదేశీయుల వీసాలు రద్దు, బ్లాక్ లిస్టులోకి, కేంద్రం ఆదేశం..!

Friday, April 3, 2020 05:50 AM News
ఢిల్లీ మతప్రచారానికి వచ్చిన 960 మంది విదేశీయుల వీసాలు రద్దు, బ్లాక్ లిస్టులోకి, కేంద్రం ఆదేశం..!

నిబంధనలు విరుధంగా ఢిల్లీ తబ్లిఘి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. వీసాల రద్దుతో పాటు వారి పాస్ పోర్టులను బ్లాక్ లిస్టులో పెడుతూ కేంద్రం హోంశాఖ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ విదేశీయులపై తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

పర్యాటక వీసాలపై వచ్చిన ఈ విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ మర్కజ్ దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన విషయం తెలిసిందే. మర్కత్‌కు వెళ్లివచ్చిన వారి కారణంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.

For All Tech Queries Please Click Here..!
Topics: