కరోనా బ్రేకింగ్: ఇండియాలో గత 24 గంటల్లో 409 కొత్త కేసులు, 7 మంది మృతి.!

Thursday, April 2, 2020 06:51 AM News
కరోనా బ్రేకింగ్: ఇండియాలో గత 24 గంటల్లో 409 కొత్త కేసులు, 7  మంది మృతి.!

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 409 కొత్త కేసులు నమోదయ్యాయని , 7 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క తమిళనాడులోనే  110 కొత్త కేసులు నమోదయ్యాయి కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1870 కాగా మరణాల సంఖ్య 56 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయో చూదాము.

మహారాష్ట్ర :335

కేరళ : 265

తమిళనాడు : 234

కర్ణాటక : 110

తెలంగాణ :127

ఆంధ్రప్రదేశ్ :111 

For All Tech Queries Please Click Here..!
Topics: