పలు ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 25 నోటిఫికేషన్లు

Friday, December 28, 2018 10:01 AM News
పలు ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 25 నోటిఫికేషన్లు

రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెలాఖరుకు 25 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల నోటిఫికేషన్లతో పాటు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు ఈ నోటిఫికేషన్లు విడుదలవుతాయని స్పష్టంచేశారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు. గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులు తెలుగుభాష పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని తెలిపారు. ఆంగ్లంతో పాటు తెలుగు భాష పరీక్ష అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం ఉంటుందని వివరించారు.

For All Tech Queries Please Click Here..!