కరోనా బ్రేకింగ్: ఇండియాలో గత 24 గంటల్లో 504 కొత్త కేసులు, 13 మంది మృతి.!

Sunday, April 5, 2020 08:56 AM News
కరోనా బ్రేకింగ్: ఇండియాలో గత 24 గంటల్లో 504 కొత్త కేసులు, 13  మంది మృతి.!

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 504 కొత్త కేసులు నమోదయ్యాయని , 13 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క ఢిల్లీ లోనే  59,  ఆంధ్రప్రదేశ్ లో 28, తెలంగాణాలో 43 కొత్త కేసులు నమోదయ్యాయి,  కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3289 కాగా మరణాల సంఖ్య 99 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయో చూదాము.

మహారాష్ట్ర :635

కేరళ : 306

ఢిల్లీ : 445

తమిళనాడు : 485

కర్ణాటక : 144

తెలంగాణ :272

ఆంధ్రప్రదేశ్ :192

For All Tech Queries Please Click Here..!
Topics: