ఎన్టీఆర్ నే టార్గెట్ చేశారు.

Thursday, December 27, 2018 12:10 PM Entertainment
ఎన్టీఆర్ నే టార్గెట్ చేశారు.

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో  కాఫీ విత్ కరణ్ జోహార్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి తాజాగా బాహుబలి టీమ్ రాజమౌళి, రానా, ప్రభాస్ గెస్ట్ లుగా వెళ్లారు. అందులో భాగంగా హోస్ట్ కారం జోహార్ రాజమౌళిని ఈ షోకి రానా, ప్రభాస్ ల తో కాకుండా వేరే ఎవరితో రావాలని ఉంది అని అడగ్గా తారక్, రవితేజ అని సమాధానం చెప్పాడు.

ప్రభాస్ ని వీరిలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? అని ఆప్షన్ ఇవ్వగా తారక్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అని ఈ వరుస క్రమంలో చెప్పుకొచ్చారు. రానాని లాంగ్ డ్రైవ్ కి ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడుతావ్ అని అడిగితె.... ఎన్టీఆర్ అని బదులు ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. సరదాగా సాగిన ఈ షోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

For All Tech Queries Please Click Here..!