లక్ష్మీ'స్ ఎన్‌టీఆర్ సినిమా నిర్మాతకు ఈసీ నోటీసులు..!

Monday, March 25, 2019 11:00 AM Entertainment
లక్ష్మీ'స్ ఎన్‌టీఆర్ సినిమా నిర్మాతకు ఈసీ నోటీసులు..!

విడుదల సమయం దగ్గరయ్యే కొద్ది లక్ష్మీ'స్ ఎన్‌టీఆర్ సినిమా పైన వివాదాలు పెరిగిపోతున్నాయి. సినిమా విడుదలపై అభ్యంతరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీ'స్ ఎన్‌టీఆర్ సినిమా నిర్మాత రాకేశ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 25 మార్చి 2019 ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం ముందు స్వయంగా హాజరు కావాలంటూ నోటీసులు పంపింది.

సినిమాకు సంబంధించిన అభ్యంతరాలపై నిర్మాత రాకేశ్ రెడ్డిని వివరణ కోరనున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా మార్చి 29వ తేదీన విడుదల అంతా సిద్ధం అయింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ సినిమా విడుదలను అన్నిచోట్లా అడ్డుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేసిన పిటిషన్‌లను తెలంగాణ హైకోర్టు ఇటీవలే కొట్టేసింది.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా లక్ష్మీ పార్వతి కోణంలో చంద్రబాబు చేసిన కుట్ర ఏమిటి? అనే కథపైన ఈ సినిమా తీశారు. ఈ క్రమంలో రాకేశ్ రెడ్డి ఎన్నికల సంఘం ముందు హాజరైన తర్వాతే ఈ సినిమా విడుదల పైన స్పష్టత రానుంది. 

For All Tech Queries Please Click Here..!