యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ విరాట్ కోహ్లీ కలిసి నటించబోతున్నారు..!

Thursday, June 20, 2019 10:55 AM Entertainment
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ విరాట్ కోహ్లీ కలిసి నటించబోతున్నారు..!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్.టి.ఆర్ , ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కోసం క‌లిసి నటించనున్నారు. వివ‌రాల్లోకెళ్తే మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డ‌ప‌డం మంచిది కాదు, దాని వ‌ల్ల రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ జ‌రుగుతున్నాయి. కుటుంబాలు అర్ధాంతరంగా రోడ్డున ప‌డుతున్నాయి. దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌ను పెంచేందుకు ఎన్‌.డి.టి.వి ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించ‌నుంది. అందులో భాగంగా ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో తార‌క్ క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నారని టాక్‌. వీరితో పాటు వివిధ రంగాల‌కు చెందిన 7గురు సెల‌బ్రిటీలు ప్ర‌చారక‌ర్త‌లుగా ప‌నిచేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

తారక్ ఇంట్లో తీరని విషాదం (తారక్ అన్న మరియూ నాన్న ఆక్సిడెంట్లో చనిపోవడం) జరిగినప్పటినుంచి తారక్ ప్రతి సినిమాలో డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి అని అందరిని కోరుతున్నారు.   

For All Tech Queries Please Click Here..!