యంగ్ టైగర్ ఎన్టీఆర్ విరాట్ కోహ్లీ కలిసి నటించబోతున్నారు..!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్.టి.ఆర్ , ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం కలిసి నటించనున్నారు. వివరాల్లోకెళ్తే మద్యం సేవించి వాహనాలు నడపడం మంచిది కాదు, దాని వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కుటుంబాలు అర్ధాంతరంగా రోడ్డున పడుతున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ఎన్.డి.టి.వి ఓ అవేర్నెస్ ప్రోగ్రామ్ను నిర్వహించనుంది. అందులో భాగంగా ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో తారక్ కలిసి వర్క్ చేయబోతున్నారని టాక్. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన 7గురు సెలబ్రిటీలు ప్రచారకర్తలుగా పనిచేయనున్నారు. త్వరలోనే ఈ ప్రోగ్రామ్కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
తారక్ ఇంట్లో తీరని విషాదం (తారక్ అన్న మరియూ నాన్న ఆక్సిడెంట్లో చనిపోవడం) జరిగినప్పటినుంచి తారక్ ప్రతి సినిమాలో డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి అని అందరిని కోరుతున్నారు.