భారీ విరాళం ప్రకటించిన బన్నీ.. కేరళ ప్రభుత్వానికీ ఆర్థిక సాయం

Friday, March 27, 2020 01:47 PM Entertainment
భారీ విరాళం ప్రకటించిన బన్నీ.. కేరళ ప్రభుత్వానికీ ఆర్థిక సాయం

అందరూ రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఆర్థిక సాయాన్ని ప్రకటించగా అల్లు అర్జున్ కేరళ ప్రభుత్వానికి సైతం అండగా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోలు కేంద్ర ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్, తమన్ వంటి వారు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.కరోనాతో పోరాడేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చాడు.

తాజాగా అల్లు అర్జున్ స్పందిస్తూ కరోనాను ఎదుర్కొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళ ప్రభుత్వానికి కలిసి రూ. 1.25కోట్ల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించాడు.

For All Tech Queries Please Click Here..!
Topics: