నెల్లూరు జిల్లాలో దారుణం: యువతిపై ఐదు మంది సామూహిక అత్యాచారం

Monday, February 4, 2019 04:44 PM Crime
నెల్లూరు జిల్లాలో దారుణం: యువతిపై ఐదు మంది సామూహిక అత్యాచారం

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో దారుణం జరిగింది. ఐదు మంది మృగాళ్లు ఓ యువతిని రైల్వే స్టేషన్ నుండి ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రేమజంటపై అటుగా వచ్చిన ఐదుగురు వ్యక్తులు ప్రియుడిపై దాడి చేసి, యువతిని ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడంతో అందరూ మూకుమ్మడిగా గాలింపు చేపట్టారు. అయితే ఆలోపే ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వీరిద్దరూ నెల్లూరులోని శ్రీసిటీలో పనిచేస్తున్నారు. శ్రీకాకుళం వెళ్లే బొకారో ఎక్స్‌ప్రెస్ రైలులోని జనరల్ భోగీలో ఎక్కేందుకు ఫ్లాట్‌ఫామ్ మీద చివరి బెంచీలో కూర్చున్నారు. ఫ్లాట్‌ఫామ్‌కు చివర కావడం వలన నిర్మానుష్యంగా ఉండటంతో అటుగా వచ్చిన ఐదుగురు ఆగంతకులు ప్రేమ జంటపై దాడి చేసి, యువతిని రైలు పట్టాలపైనే నిర్మానుష్య ప్రదేశానికి ఈడ్చుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమై గాయాలతో బాధపడుతున్న యువతిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రేమ జంట ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసుకున్నారు.

For All Tech Queries Please Click Here..!