విజయవాడలో మహిళ దారుణ హత్య.

Saturday, February 1, 2020 09:35 AM Crime
విజయవాడలో మహిళ దారుణ హత్య.

విజయవాడలో ఒక దారుణం చోటుచేసుకుంది. నగల కోసం ఓ మహిళను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భవానిపురం పాండు హోటల్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దోచుకొని పారిపోయారు.

ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో దుండగులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి దారుణంగా హతమార్చారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం స్థానికుల సమాచారంతో వివరాలను సేకరిస్తోంది. ఆ ప్రాంత సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: