అత్తింటి వేధింపులకు బలిఅయిన వివాహిత

Monday, May 20, 2019 10:00 AM Crime
అత్తింటి వేధింపులకు బలిఅయిన వివాహిత

అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత బలైన సంఘటన శంషాబాద్ ఆర్‌జీఐఏ పరిధిలో చోటుచేసుకుంది, ఈ ఘటన కొంచం లేటుగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నంకు చెందిన అక్షిత(25)కు, శంషాబాద్‌లోని ఆర్‌బీనగర్‌కు చెందిన సోమన్నగారి రాఘవేందర్‌రెడ్డికి ఏడాది క్రితం ఘనంగా వివాహం జరిగింది. రాఘవేందర్‌రెడ్డి వృత్తిరీత్యా అడ్వకేట్ కాగా, కొంతకాలం నుంచి దంపతుల మధ్య కుటుంబ కలహాలు, వేధింపులు మొదలయ్యాయి. దీంతో శనివారం అర్ధరాత్రి అక్షిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది.

వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతురాలు కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందిచడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అక్షితను భర్త, అత్తమామలే చంపారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. కట్నం భారీగా ఇచ్చి ఘనంగా వివాహం చేశామని బోరున విలపించారు. అక్షిత మృతదేహంతో ఆమె బంధువులు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగారు. భర్త, అత్తామామలను వెంటనే అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

For All Tech Queries Please Click Here..!