డాక్టరుతో అక్రమసంబంధం: అమాయకం నటిస్తూనే భర్తను దారుణంగా చంపించింది

Friday, February 1, 2019 05:47 PM Crime
డాక్టరుతో అక్రమసంబంధం: అమాయకం నటిస్తూనే  భర్తను దారుణంగా చంపించింది

పెళ్లి తరువాత ప్రతి ఇల్లాలు కోరుకునేది... ఆర్థిక ఇబ్బందులులేని జీవితం. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు... ఇద్దరు పిల్లలు... భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో అక్రమ సంబంధం చిచ్చురేపింది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డును తొలగించుకోవాలని భర్తను కిడ్నాప్ చేయించి, అతి దారుణంగా హత్య చేయించింది. వినయం, అమాయకత్వం నటిస్తూ ప్రియుడి మోజులో పడి తల్లి చేసిన ఆ దుశ్చర్యకు ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.

వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన జగన్, రజనీలకు ఇద్దరు మగపిల్లలు. పిల్లల చదువు, వ్యాపార పనుల రీత్యా వీరు కంభంలో స్థిరపడ్డారు. జగన్ జేసీబీ మరియు ట్రాక్టర్లను అద్దెకు నడుపుతూ ఉండేవాడు. చాలా వరకు ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలో ఓ డాక్టరుతో ఏర్పడిన రజనీ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం అనుకోకుండా రజనీ భర్త కంటపడింది. అప్పటి నుండి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన ప్రియుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన రజనీ ప్రియుడితో భర్తను కిడ్నాప్ చేయించింది. అంతటితో ఆగకుండా అతి దారుణంగా చంపింది.

జగన్ తండ్రి కనిపించలేదని ఆయన తండ్రి ఫిర్యాదు చేశాడు. రజనీ తీరును అనుమానించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి రజనీతో పాటు డాక్టరును అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!