మందు మానలేదని భర్తని రోకలి బండతో కొట్టి చంపేసింది 

Tuesday, October 1, 2019 01:28 PM Crime
మందు మానలేదని భర్తని రోకలి బండతో కొట్టి చంపేసింది 

వేధింపులు తాళలేక ఓ భార్య కట్టుకున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపేసింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. హత్య చేసిన అనంతరం ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. వేధింపులు తట్టుకోలేకనే హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. 

కర్నూలు జిల్లాలో  గోస్పాడు మండలం యాళ్ళూరు గ్రామంలో నివాసముంటున్న రేష్మ, షేక్ మహబూబ్ భార్యాభర్తలు. వీరిద్దరికి 11 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి  7 సంవత్సరాలు,  3 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త షేక్ మహబూబ్ అనేక సంవత్సరాలుగా భార్య రేష్మను వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. 

భర్త వేధింపులు భరించలేక శుక్రవారం (ఆగస్టు30, 2019) ఉదయం భార్య రోకలి బండతో కొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అతను మృతి చెందాడు. హత్య అనంతరం రేష్మ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. తానే హత్య చేసినట్లు భార్య రేష్మ స్వయంగా పోలీసులకు వెల్లడించారు. పోలీసు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. భర్త చనిపోవడం, భార్య స్టేషన్ లో లొంగిపోవడంతో పిల్లలు అనాధలుగా మారారని పలువురు బాధపడతున్నారు. తాగుడుకు బానిసలు అయి సంసారాన్ని కూలదోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

For All Tech Queries Please Click Here..!