గ్రామస్తులంతా హోలీ బిజీలో ఉన్నవేళ.. మూడో తరగతి బాలికపై.
Wednesday, March 11, 2020 04:50 PM Crime
మహిళా రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా, ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా, పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు చిన్నారులపై కూడా అత్యాచారాలకు తెగబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఉనావ్లో 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. గ్రామస్తులంతా హోలీ వేడుకల్లో బిజీగా ఉన్నవేళ ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలోనూ ఇదే ఉనావ్లో పలు అత్యాచార ఘటనలు బయటపడ్డ సంగతి తెలిసిందే.
For All Tech Queries Please Click Here..!