ఇద్దరు భార్యలు, ప్రేయసి, తండ్రిని, పిల్లనిచ్చిన మామను చంపేశాడు... ఎందుకో తెలుసా?

Sunday, March 31, 2019 01:20 PM Crime
ఇద్దరు భార్యలు, ప్రేయసి, తండ్రిని, పిల్లనిచ్చిన మామను చంపేశాడు... ఎందుకో తెలుసా?

ప్రియురాలిని కోరిక తీర్చమంటే తిరస్కరించింది. పెళ్లి చేసుకుని, హాయిగా కాపురం చేసుకుందామనుకుంటే... పెళ్లాలు గొడవలు చేయడం మొదలెట్టారు. తండ్రినీ అనుమానంతో చూడడం మొదలెట్టాడు... ఇలా తనకు కష్టం వచ్చిన ప్రతీసారి... దానికి కారణమైన వారిని చంపేశాడు. ఓ ప్రేయసి, ఇద్దరు పెళ్లాలు, కన్నతండ్రి, పిల్లనిచ్చిన మామ... అతని చేతిలో దారుణహత్యకు గురయ్యారు. స్థానికంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 

షాద్‌నగర్ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలంలోని మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన రాములు అనే 24 ఏళ్ల వ్యక్తి, అదే గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో తన కోరిక తీర్చాలంటూ ఆమెను కోరాడు రాములు. దానికి మంగమ్మ ఒప్పుకోకపోవడంతో ఒంటరిగా వెళ్తున్న ఆమెపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగమ్మ ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... రాములును అరెస్ట్ చేసి దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన పార్వతమ్మ అనే యువతిని పెళ్లి చేసుకున్న రాములు... కొన్నిరోజులు సజావుగా కాపురం చేసిన తర్వాత మనస్పర్థల కారణంగా ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఆ విషయం బయటికి పొక్కకుండా అగ్నిప్రమాదంగా చిత్రీకరించాడు. ఆ తర్వాత స్పప్న అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు, అతడి తండ్రితో వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం కలిగింది రాములుకి. ఆ అనుమానంతో ఇద్దరినీ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాములు... జైలుకి వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మంజుల అనే యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. భార్యా, తండ్రిని చంపిన రాములుతో పెళ్లికి మంజుల తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమె పేరు మీద తనకున్న పొలాన్ని రాసిచ్చాడు. పెళ్లి కాగానే మాయమాటలు చెప్పి, పొలాన్ని అమ్మేశాడు. దానికి మంజుల తండ్రి ఒప్పుకోకపోవడంతో అతనికి ఫుల్లుగా తాగించి, బండరాయితో కొట్టి చంపేశాడు. తన తండ్రిని భర్తే చంపి ఉంటాడని అనుమానించిన మంజుల... అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో కొన్నాళ్లుగా మంచిగా మెలిగి మంగమ్మతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆ చనువుతో కోరిక తీర్చమని అడిగితే ఆమె ఒప్పుకోలేదు. మొదటి భార్యను హతమార్చినట్టే మంగమ్మను కూడా కిరోసిన్ పోసి, నిప్పు పెట్టి చంపేశాడు. ఇలా అవసరం ఉన్నా... లేకపోయినా... తన కిరాతకత్వంతో 24 ఏళ్లకే ఐదు మందిని అతి దారుణంగా చంపేశాడు.

For All Tech Queries Please Click Here..!