గుంటూరులో 250 కిలోల గంజాయి పట్టివేత.. అవాక్కయిన పోలీసులు

Saturday, July 6, 2019 05:43 PM Crime
గుంటూరులో 250 కిలోల గంజాయి పట్టివేత.. అవాక్కయిన పోలీసులు

అంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాలనుంచి గంజాయిని అక్రమార్కులు యుధేచ్చగా తరలించేస్తున్నారు. గంజాయితో వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో దాన్ని అక్కడే వదిలివేసి పారిపోయారు స్మగ్లర్లు. ఈ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్ధానిక పోలీసుల కథనం ప్రకారం విజయవాడ మీదుగా వస్తున్నఓ కారు ఇటుకల ప్యాక్టరీ వద్దకు రాగానే టైరు పేలిపోవడంతో దాన్ని అక్కడే వదిలి స్మగ్లర్లు వెళ్లిపోయారు. అయితే గుర్తు తెలియని కారు పార్క్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకి చెప్పటంతో, పోలీసులు కారుని తనిఖీ చేయటంతో అసలు గుట్టు రట్టయ్యింది.

నిలిచిఉన్న ఆ కారులో సుమారు 250 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ప్రయాణిస్తున్న కారుకు ఉన్న నెంబర్ నకిలీ నెంబర్ అని చెప్పారు, చాసిస్ నెంబర్ ఆధారంగా అది తమిళనాడుకు చెందిన కారుగా గుర్తించారు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నది ఎవరనేది ఇంకా తెలియలేదు, ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!