ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తే.. భార్య ముందే భర్తను చంపేశారు

Friday, February 8, 2019 12:55 PM Crime
ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తే.. భార్య ముందే భర్తను చంపేశారు

దీపక్ అనే వ్యక్తి తన ఇంటికి ఇద్దరు స్నేహితులను తీసుకొచ్చారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఇంతలో ముగ్గురి మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. ఈ చిన్న వివాదం దీపక్ హత్యకు దారి తీసింది. అవును మీరు చదివింది నిజమే, ఇద్దరు వ్యక్తులు సహనం కోల్పోయి దీపక్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావమైన దీపక్ స్పృహ తప్పి పడిపోయాడు. చనిపోయాడని భావించిన నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ తతంగమంతా దీపక్ భార్య ఎదుటే జరిగింది. కత్తిపోట్లకు నేలకొరిగిన స్పృహ కోల్పోయిన భర్తను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్తను చంపిన ఇద్దరు వ్యక్తులపై దీపక్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!