200 మంది అమ్మాయిలపై అత్యాచారం.. వీడియోలు తీసి పదేపదే గ్యాంప్ రేప్

Tuesday, March 12, 2019 02:04 PM Crime
200 మంది అమ్మాయిలపై అత్యాచారం.. వీడియోలు తీసి పదేపదే గ్యాంప్ రేప్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి వాటి ద్వారా..  అమ్మాయిలకు మాయమాటలు చెప్పి.. వారి కామ వాంచలను తీర్చమని కోరడం..ఆ తర్వాత నమ్మి వచ్చిన విద్యార్థులను మోసం చేసి..కామ వాంచ తీర్చుకొని..వీడియోలను రికార్డ్ చేస్తున్నారు. అలా రికార్డ్ చేసిన వీడియోలను ట్విటర్ లేదా వాట్పాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా మిగితా వారితో పంచుకోవడం..అంతేకాకుండా..ఒకవేళ రమ్మన్న చోటుకు రాక పోతే..ఈ వీడియోలను చూపి అమ్మాయిలను బెదిరించడం వంటివి ఎక్కువైయాయి.  కొన్ని కొన్ని కేసులల్లో వినకపోతే..వారిపై భౌతిక దాడులను చేయడం కూడా..తెలిసిందే. అయితే అలాంటిదే.. ఒకటి.. తమిళనాడులో జరిగింది.

కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మద్య సాన్నిహిత్యం పెరిగింది..దీంతో తన మిత్రులకు పరిచయం చేస్తానంటూ ఫిబ్రవరి 12న ఆ విద్యార్థినిను కారులో తీసుకెళ్లాడు. ఊంచపేలంపట్టి అనే ప్రాంతంలో తిరునావుక్కరసు తన మిత్రులు నలుగురు కారులోకి ఎక్కారు. ఆ తర్వాత ఓ నిర్మానుష్యా ప్రాంతానికి కారును తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అంతేకాకుండా.. దానిని తమ ఫోన్‌లో  రికార్డ్ చేశారు. అయితే పదే పదే.. లైంగికవాంఛ తీర్చాలని కోరడం.. లేకపోతే వీడియో, ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామంటూ బెదిరించారు. దీంతో వేధింపులను తట్టుకోలేక విద్యార్థిని తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. షాక్ తిన్న తల్లిదండ్రలు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో శబరి, వసంతకుమార్‌, సతీష్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తిరునావుక్కరసును తిరుపతిలో గత వారం అరెస్టుఅయ్యాడు.

ఈ కేసుపై నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో సుమారు వందకుపైగా రికార్డు చేసిన విద్యార్థినుల వీడియోలు బయటపడ్డాయి. దీంతో బాధితుల సంఖ్య కూడా సుమారు 200 మంది వరకు ఉండవచ్చని తెలుస్తోంది. అమ్మాయిలను, విద్యార్థినులను టార్గెట్ చేసి..వారిని అశ్లీలంగా ఫొటోలు తీసి బెదిరిస్తూ డబ్బు రాబట్టడం, వాంఛ తీర్చుకోవడమే ముఠా లక్ష్యంగా అనుమానిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!