బంగారంలాంటి అందమైన భార్యను వెంబడించి రాళ్లతో దారుణంగా కొట్టి చంపాడు.. ఎందుకంటే?

Friday, August 9, 2019 04:22 PM Crime
బంగారంలాంటి అందమైన భార్యను వెంబడించి రాళ్లతో దారుణంగా కొట్టి చంపాడు.. ఎందుకంటే?

అనుమానం పెనుభూతమై భార్య హత్యకు దారితీసింది. భార్యను రాళ్లతో కొట్టి భర్త కడతేర్చిన ఘటన బుధవారం డోన్‌ మండలంలోని బొంతిరాళ్ళ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం మండలంలోని బొంతిరాళ్ళ గ్రామానికి చెందిన అర్జున్‌కు 8ఏళ్ల క్రితం ధర్మావరం గ్రామానికి చెందిన లలితతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు సూర్యకళ, అక్షర, కుమారుడు రాకేష్‌ ఉన్నారు. భార్యభర్తలిద్దరూ కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంత కాలం భార్య లలితను భర్త అర్జున్‌ వేధిస్తూ వస్తున్నాడు. అనుమానంతో భార్యపై కక్ష పెంచుకున్నాడు. మధాహ్నం పొలం పనులకు వెళ్లిన భార్యభర్తలిద్దరూ తిరిగి వస్తున్నారు. అయితే గ్రామ సమీపంలోని వంక దారిలో భార్య లలితపై రాళ్లతో భర్త దాడికి పాల్పడ్డాడు.

తలపై రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు లలిత తల్లి పొలీసులు ఫిర్యాదు చేశారు. బొంతిరాళ్ళ గ్రామంలో తల్లి హత్యకు గురికావడంతో ముగ్గురు చిన్నారులు రోదిస్తున్న తీరు పలువురిని బాధకి గురిచేసింది. ఇద్దరు గ్రామంలోని పాఠశాలలోనే చదువుకుంటున్నారు. అయితే తల్లిని పోగొట్టుకొని ఆ ముగ్గురు చిన్నారులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారిని చూసి అయ్యో పాపం అంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: